తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లోక్సభలో కేంద్రాన్ని కోరారు. రామగుండం-మణుగూరు, కాజీపేట-కరీంనగర్ కొత్త లైన్లతో పాటు మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బొల్లారం స్టేషన్ నుండి కేరళ, గుజరాత్, యూపీలకు కొత్త రైళ్లను నడపాలని ఆయన కోరగా.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.