తెలంగాణలో కృష్ణా నదిపై మరో వంతెన నిర్మితమవుతోంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ నారాయణపేట జిల్లాలో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. నారాయణపేట జిల్లా వాసునగర్.. కర్ణాటక శక్తి నగర్ మధ్య ఈ కొత్త వంతెన నిర్మాణం జరుగుతోంది. మూడేళ్ల కిందట వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు శ్రమిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో రవాణా, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు మెరుగవుతాయి.