తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) 15 కొత్త జాతీయ రహదారులను నిర్మించనుంది. మొత్తం 1,123 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టులకు రూ.33 వేల కోట్లు ఖర్చు కానుంది. రాబోయే మూడేళ్లలో ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారుల నిర్మాణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది.