తెలంగాణలో జాతీయ రహదారుల (నేషనల్ హైవేల) నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం చేయాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. 16 జాతీయ రహదారుల కోసం 1550 హెక్టార్ల భూమి అవసరం ఉందన్నారు. కేంద్రం అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ.. భూసేకరణ పూర్తికాలేదన్నారు. ముఖ్యమంత్రిని ఈ విషయమై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.