తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రూ. 868 కోట్లతో 34 రహదారులు, వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించగా, దీని ద్వారా రాష్ట్రంలో 422.36 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చెందుతాయి. జాతీయ రహదారుల నిర్మాణంలో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.