రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో 39 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థులకు.. చదువు పూర్తి కాగానే.. ఉద్యోగం చేతికి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. కొత్తగా తీసుకురానున్న జాబ్ ఓరియెంటెడ్ కోర్సులతో హైదరాబాద్ను పలు రంగాల్లో మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త విద్యా విధానంతో సుమారు 20 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేస్తున్నాయి.