తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి వేగంగా సాగుతోంది. ఇటీవల బేగంపేట, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు అందుబాటులోకి రాగా.. తాజాగా తాండూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పైవంతెన, ఎస్కలేటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎయిర్పోర్టు తరహాలో అత్యాధునిక సౌకర్యాలు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. ఈ పనులు ఈ ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.