తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లక్షలాదిగా అప్లికేషన్లు పెండింగ్లో ఉండగా.. గ్రామసభల్లో మరింత మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. దీంతో దరఖాస్తులను వడపోసి.. అర్హులకు పెన్షన్లు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.