తెలంగాణ ప్రభుత్వం TGSRTC బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజారవాణాను మెరుగుపరచడానికి కొత్త బస్సులు, డిపోలు, బస్ స్టేషన్ల ఆధునీకరణ, నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా.. నేడు ములుగు జిల్లా ఏటూరునాగారంలో రూ.4.5 కోట్లతో 99వ ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన చేశారు. ఈ డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన ప్రజా రవాణా అందించడమే తమ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి పొన్నం వెల్లడించారు.