తెలంగాణలో టీబీ వ్యాధి క్రమంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4,600 కేసులు బయటపడినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీబీ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.