తెలంగాణ గొర్రెల పంపిణీ స్కాం కేసులో ప్రధాన నిందితుడు మోయినుద్దీన్ను ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలున్న ఈ కేసులో ఇదివరకే 17 మంది అరెస్ట్ కాగా, మోయినుద్దీన్ అరెస్టుతో దర్యాప్తు ముమ్మరం కానుంది. మోయినుద్దీన్ అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అతడిచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.