తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనినే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. అదే గొడ్డలి.. కొత్త చేతులని విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వేలం ఆపాలంటూ ఆయన ట్వీట్ చేసారు.