తెలంగాణ రాష్ట్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు రేవత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూంలకు సంబంధించి ప్రాజెక్టులు ఇప్పటి వరకు వివిధ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉండగా.. ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గృహ నిర్మాణ శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 5 ప్రకారం.. జిల్లాల్లోని ప్రాజెక్టులను కలెక్టర్లు, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కమిషనర్ సమన్వయం చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించాలి.