దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణలోని హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ వైద్యునికి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక వ్యక్తికి తాజాగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో మొదటి కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను కూడా నొక్కిచెబుతున్నారు.