రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే అవి వడగళ్ల వానలని.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.