తెలంగాణకు మరోసారి వర్ష సూచన జారీ అయింది. ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో వర్షానికి ఛాన్స్ లేదు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.