తెలంగాణలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువను పెంచాలని, కొన్ని ప్రాంతాల్లో తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు.