వాతావరణ శాఖ తెలంగాణకు చల్లటి వార్త చెప్పింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం భారీ ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ ప్రకటనతో కాస్త ఉపశమనం లభించనుంది.