తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండలో బయటకు వెళితే వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.