రాష్ట్రంలో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.84.15 కోట్ల కుంభకోణం బయటికి వచ్చింది. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి.. కోట్ల రూపాయలను కాజేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన జీఎస్టీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జీఎస్టీ మోసాలకు పాల్పడిన కంపెనీల రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేశారు.