గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులు ఇబ్బందులకు గురయ్యారు. తమ భూముల వివరాలు డిజిటల్గా లేవని కొందరు చెబుతుండగా.. నిషేధిత జాబితాలో తమ భూములు ఉన్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక.. తమ భూమి వేరొకరి పేరుమీద ఉందని అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదని రైతులు వాపోయిన ఘటనలు తెలంగాణలో ఎన్నో చోట్ల చోటుచేసుకున్నాయి. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిలో జరిగిన అవకతవకలు గురించి ఆరా తీశారు. దీంతో దాని స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చారు. దీని వలన భూ సమస్యలు ఒకొక్కటి పరిష్కారం అవుతూ వస్తున్నాయి.