తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు కాస్త ఎక్కువగా నమోదవటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.8గా భూకంప తీవ్రత నమోదైంది. గతంలో సంభవించిన భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.