తెలంగాణలో రియల్ ఎస్టేట్ వృద్ధితో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం తక్కువ విలువలు ఉండటంతో సర్కార్ ఆదాయానికి గండి పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ దీనిపై చర్చించింది. ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా, పెంపు శాస్త్రీయంగా ఉండాలని సూచించారు. త్వరలోనే పెంపుపై తుది నిర్ణయం వెలువడనుంది.