తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం వరంగల్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీలను నియమించనున్నారు. ఇందుకోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 15 రహదారి ప్రాజెక్టుల మీద కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఖమ్మం వరంగల్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.