తెలంగాణలోని భద్రాద్రి రామయ్య క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఖమ్మం జిల్లాలోని తల్లాడ నుండి భద్రాచలం వరకు 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని రూ. 2,606 కోట్లతో నిర్మించనున్నారు. ఈ రహదారి ములుగు, భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.