తెలంగాణలో మరో కీలక హైవే విస్తరణకు అనుమతులు లభించాయి. నిజామాబాద్- జగ్దల్పూర్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,529 కోట్లు కేటాయించింది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల (క్యాతన్పల్లి) వరకు 125 కి.మీల మేర విస్తరించే ఈ రహదారి గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ పద్ధతిలో బైపాస్లతో నిర్మితమవుతుంది.