మెదక్-నర్సాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రమాదాలు అధికంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విస్తరణతో ప్రయాణం సురక్షితంగా, వేగవంతంగా మారుతుందని, హైదరాబాద్కు తక్కువ సమయంలో చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు డీపీఆర్ తయారీలో నిమగ్నమయ్యారు.