తెలంగాణలో మరోసారి భూకంపం.. భూకంప తీవ్రత 3.9.. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లలో కంపించిన భూమి

3 months ago 21
తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి వేళ.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భూకంపం రావడంతో ఆ జిల్లాల్లోని జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాత్రి పూట భూకంపం రావడంతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రజలు.. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇళ్లల్లో వస్తువులు కదలడం, కింద పడటం జరగ్గా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article