తెలంగాణలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు ఆధునీకరణతో సరికొత్త రూపును సంతరించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 22న వీటిని ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 26.64 కోట్లతో కరీంనగర్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ఆధునిక సదుపాయాలు కల్పించారు. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.