తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలానికి మూడు నెలల రేషన్ బియ్యం నిల్వలను సిద్ధం చేయాలన్న కేంద్ర ఆదేశాలపై స్పందించింది. తక్షణమే సాధ్యం కాదని, జూన్ చివరి వరకు గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. సన్నబియ్యం పంపిణీ పథకం అమలులో ఉన్నందున.. 5 లక్షల టన్నుల బియ్యం నిల్వ చేయడం సవాలుగా మారింది. జూన్లో ఒక నెల, జూలైలో రెండు నెలల కోటాను సరఫరా చేయాలని రాష్ట్రం ప్రణాళిక వేస్తోంది.