తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వంట గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.