తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఎండులు, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా.. 11 గంటల తర్వాత బయట తిరిగే పరిస్తితి లేకుండా పోయింది. ఇక వడదెబ్బ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే నలుగురు మృతిచెందారు.