తెలంగాణలోని దివ్యాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ.లక్ష ప్రోత్సాహం అందించేవారు. ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా వారికి కూడా రూ.లక్ష వివాహ ప్రోత్సాహం అందుతుందని తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి సీతక్క చొరవతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈ పథకం కింద రూ. లక్ష అందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఈ వార్తలో తెలుసుకుందాం.