మహబూబ్ నగరానికి మూడో బైపాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డీపీఆర్ సర్వే, టెండర్ ప్రక్రియకు అనుమతులు లభించాయి. ఇప్పటికే రెండు బైపాస్లు నగరాన్ని అనుసంధానిస్తుండగా.. అప్పన్నపల్లి ఆర్వోబీ నుంచి చిన్నదర్పల్లి వరకు 11 కి.మీ నిర్మించే మూడో బైపాస్ నగరానికి రింగ్రోడ్డుగా మారనుంది. ఇది జడ్చర్ల వైపు నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండా నేరుగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది.