తెలంగాణలోని కౌలు రైతులకు గుడ్న్యూస్. పట్టా భూములు ఉన్న రైతుల మాదిరిగానే వీరికి కూడా బ్యాంకులు పంట రుణాలు మంజురు చేయనున్నాయి. రూ.2.5 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని ఏడు జిల్లాల రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.