పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణలో నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కొత్త కార్డుల ద్వారా 11.11 లక్షల మందికి, పాత కార్డుల్లో కొత్తగా చేర్చిన 4.41 లక్షల మందితో కలిపి మొత్తం 15.53 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు, లబ్ధిదారులు 3 కోట్లకు చేరుతారు.