తెలంగాణలో చేపల వినియోగం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ చేపల్లో ఉన్న పోషక విలువలపై అవగాహన లేక ప్రజలు వాటిని తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సగటు తలసరి వినియోగం 8.37 కిలోలు మాత్రమే ఉండగా.. ఇతర రాష్ట్రాలు అధిక వినియోగంతో ముందున్నాయి. చేపల వినియోగం పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.