vande bharat sleeper secunderabad-delhi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు నడవనున్నాయి. తొలి విడతలో రెండు రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఒకటి, విజయవాడ నుంచి బెంగళూరుకు మరొక రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్-ఢిల్లీ మార్గం రైలు ఛార్జీలు కూడా నిర్ణయించారు. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కూడా రైలు నడిపే ఆలోచనలో ఉన్నారు.