తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2014 నాటికి తెలంగాణలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా.. గత పదేళ్లలో అవి 5,200 కిలోమీటర్లకు పెరిగాయని తెలిపారు. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతోందని.. పెట్టుబడులు వచ్చే ప్రాంతాలకు రహదారులను నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.