chief ministers of telugu states meet in delhi: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి-బనకచర్ల అనుసంధానంపై ప్రధానంగా దృష్టి సారించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 13 అంశాలతో తమ డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. అయితే వీటిలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అందులో అమరావతిలో కృష్ణా బోర్డు, హైదరాబాద్లో గోదావరి బోర్డు ఉండే విధంగా తీర్మానించినట్లు తెలిపారు.