వేసవి రద్దీతో ట్రైన్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ట్రైన్లలో అయితే కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు. అదే సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అలసటతో గాఢ నిద్రలోకి జారుకుంటుండగా.. అదే అదనుగా చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామునే చోరీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు అలర్ట్ జారీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే.. 100 లేదా 139కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.