AP Thefts In Trains: ఏపీలో రైళ్లలో మహిళలే లక్ష్యంగా దొంగతనాల బెడద ఎక్కువైంది. నూజివీడు, ఏలూరు, భీమడోలు వంటి స్టేషన్ల పరిధిలో తరచూ చైన్ స్నాచింగ్, మొబైల్స్ దొంగతనాలు జరుగుతున్నాయి. గౌతమి, గోదావరి ఎక్స్ప్రెస్లలో మహిళా ప్రయాణికులను బెదిరించి దొంగలు బంగారం, ఫోన్లు దోచుకుంటున్నారు. పవర్పేట రైల్వే స్టేషన్లో జూట్మిల్ బ్రిడ్జి కింద దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.