దసరా సందర్భంగా రేవంత్ సర్కార్, జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కార్మికుల కోసం ప్రమాద బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఒక్కొక్క కార్మికుడికి .30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీనికోసం జీహెచ్ఎంసీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జీహెచ్ఎంసీ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సింగరేణి సంస్థనే ఆదర్శం అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు..