భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదనపు కట్నం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత కొంత కాలంగా ఆ భార్యాభర్తల మధ్య గొడవులు జరుగుతూ ఉన్నాయి. అదనపు కట్నం తేవాలని అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు రోజురోజుకూ పెరిగాయి. భర్త శ్రీను కూల్డ్రింక్లో పురుగుమందు, ఎలుకల మందు కలిపి తన భార్యతో తాగించి.. ఆపై తానూ తాగాడు. భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం సమాజంలో మానవ సంబంధాలు దిగజారుతున్నాయని తెలియజేస్తుంది.