కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాలకు చెందిన ఒక యువతి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా.. అక్కడ పనిచేసే దీక్షిత్ అనే కాంపౌండర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు ఆసుపత్రి సీసీ ఫుటేజ్ సేకరించి.. యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.