దివ్యాంగులకు తీపి కబురు.. ఇక వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ..

1 year ago 26
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల జారీని సెర్ప్‌ వేగవంతం చేసింది. వైకల్య పరీక్షలు నిర్వహించే ఆసుపత్రులకు రూ.10 లక్షల బడ్జెట్ ఇచ్చింది. ప్రతి కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని ఆదేశించింది. ఆడియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల కొరత తీర్చాలని వైద్య విద్య విభాగానికి లేఖ రాసింది. అంతే కాకుండా.. దివ్యాంగులకు సహాయ ఉపకరణాల దరఖాస్తు గడువును జూన్ 27 వరకు పొడిగించారు. https://tgobmms.cgg.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెర్ప్‌ సీఈఓ దివ్యాదేవరాజన్ ప్రక్రియ పర్యవేక్షణపై హామీ ఇచ్చారు. ఇది దివ్యాంగుల సాధికారతకు ఒక ముఖ్యమైన చర్యగా చెప్పుకోవచ్చు.
Read Entire Article