Pak Firing Telugu Soldier Murali Naik Died: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. మురళీ స్వగ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.