కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంది. తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 25, 26న భారత్ సమిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్, హైటెక్ సిటీ, పాతబస్తీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుమానితులపై నిఘా పెంచారు.