కాళేశ్వరం నిర్మాణం దేశంలోనే అత్యంత పెద్ద మానవ తప్పిదమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలు 20 నెలలుగా పనికిరాకపోవడం రాష్ట్రానికి పెనుభారం అయ్యిందన్నారు. 195 TMCల ప్రణాళికలో ఐదేళ్లలో 101 TMCలు మాత్రమే వినియోగమయ్యాయని.. ప్రాణహిత–చేవెళ్లతో పోలిస్తే కాళేశ్వరం అనవసర ఖర్చుగా మారిందని పేర్కొన్నారు. నిపుణుల సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.