ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనుంది. దీనికోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 2026 జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం పరిసరాల్లో 50 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటైతే.. ఇది దేశంలోనే అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్కు కానుంది.